కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియాగాంధీ మరోసారి కరోనా బారిన పడటం జరిగింది.నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ (ED) విచారణకు ముందు కరోనా బారిన పడటం తెలిసిందే.
దీంతో పోస్ట్ కరోనా కారణంగా కొన్ని రోజులపాటు సోనియా గాంధీ హాస్పిటల్లో చికిత్స తీసుకోవడం జరిగింది.అనంతరం పోస్ట్ కరోనా ఇబ్బందుల నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు.
ఇదిలా ఉంటే తాజాగా శనివారం మరో మారు కరోనా లక్షణాలు ఆమెలో బయటపడటంతో.వైద్య పరీక్షలు చేయించుకోగా మళ్లీ సోనియాగాంధీకి కరోనా పాజిటివ్ అని రిపోర్ట్ రావటం జరిగింది.
దీంతో ఇంటిలోనే ఆమె ఐసోలేషన్ కి వెళ్లిపోయారు.ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుండి పార్టీ నాయకులతో వరుస భేటీలు నిర్వహించడం జరిగింది.
అనంతరం ఈడీ విచారణకు హాజరయ్యారు.ఇటువంటి తరుణంలో ఆమెకు కరోనా తిరగబడటం కాంగ్రెస్ పార్టీలో చర్చినియాంశంగా మారింది.
ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేత జయరాం రమేష్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.సోనియా గాంధీకి పాజిటివ్ రిపోర్టు వచ్చినట్లు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు హోం సొల్యూషన్ లో ఉన్నట్లు తెలిపారు.