జింబాబ్వేతో ఈనెల 18 నుంచి వన్టే సిరీస్ ప్రారంభం కానుంది.ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో.
సిరీస్ కు కెఫ్టెన్ గా ఎంపిక చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.జింబాబ్వే పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు ఆడనున్న సంగతి తెలిసిందే.
ఈ సిరీస్ లో భారత జట్టుకు వైస్ కెఫ్టెన్ గా శిఖర్ ధావన్ వ్యవహరించనున్నాడు.
కేఎల్ రాహుల్ నేతృత్వంలో బరిలోకి దిగనున్న భారత జట్టులో శిఖర్ ధావన్తో పాటు రుతురాజ్ గైక్వాడ్, శుభ్మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చాహర్లు ఉన్నారని బీసీసీఐ ప్రకటించింది.