తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి మంత్రి వెంకట నాగేశ్వరరావు, శాసన మండలి ఛైర్మన్ కోయే మోషేన్ రాజు, సిపిఎఫ్సీ కమీషనర్ నీలం షమీరావులు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఏపి పౌర సరఫరాలు, వినియోదారుల శాఖా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ కలియుగ వైకుంఠ నాధుడిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.ఈ రాష్ట్రం సుభిక్షంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి శక్తిని ప్రసాదించాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి వారిని ప్రార్ధించినట్లు చెప్పారు.2024కి జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి నినాదం అవసరం లేదని, కులాలకు, మతాలకు అతీతంగా పాలన సాగిస్తున్నారని సీఎం ను కచ్చితంగా గెలిపిస్తుందన్నారు.