హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో టీఆర్ఎస్ నేత, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మనో నిబ్బరం కోల్పోవద్దని, ధైర్యంగా ఉండాలని సూచించారు.
ఇటీవలే ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.
తన భార్యకు సర్పంచ్ పదవి ఇప్పించలేదన్న కారణంతో టీఆర్ఎస్ కు చెందిన ఓ గ్రామ స్థాయి నేత ఎమ్మెల్యేను హత్య చేసేందుకు ప్రయత్నించారు.నిందితుడు వచ్చిన సమయంలో జీవన్ రెడ్డి మేల్కొని ఉండటంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.