పన్నుల వాటా విడుదలలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రెండు విడతల పన్నుల వాటాను మొత్తం రూ.1,16,665.75 కోట్లను విడుదల చేసింది.దేశంలోని అన్ని రాష్ట్రాల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఈ పన్నుల వాటాలు విడుదల నిదర్శనంగా నిలుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.
రాష్ట్రాలకు విడుదల అయిన పన్నుల వాటాలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్కు రూ.20,928 కోట్లు విడుదల అయ్యాయి.తర్వాత స్థానంలో నిలిచిన బీహార్కు రూ.11,734 కోట్లు విడుదల చేశారు.అనంతరం తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్కు రూ.4,721 కోట్లు, తెలంగాణకు రూ.2,452 కోట్లు విడుదలయ్యాయి.గోవాకు అత్యల్పంగా రూ.450.32 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించింది.