తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ పర్యటించారు.ఈ సందర్భంగా నగరంలోని ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయాన్ని సందర్శించారు.
ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పాస్ పోర్ట్ కార్యాలయం తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ఈ నేపథ్యంలో కార్యాలయం సిబ్బందితో గ్రూప్ ఫొటో దిగారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మరింత కృషి చేయాలని సిబ్బందికి పిలుపునిచ్చారు.