దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సీతారామం. తాజాగా థియేటర్ లలో గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి కాకుండా సినీ సెలెబ్రెటీల నుంచి కూడా స్పెషల్ దక్కుతున్నాయి.
కేవలం అభిమానులు మాత్రమే కాకుండా సినీ ప్రముఖులు కూడా వారి అభిప్రాయాలను రివ్యూలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.తాజాగా సీతారామం సినిమా పై స్పందించారు హీరో సాయి ధరమ్ తేజ్.
సీతారామం సినిమాపై సాయి ధరమ్ తేజ్ ప్రత్యేకంగా రివ్యూ రాసుకోచ్చాడు.స్వప్నక్క ఏ హేట్ యూ.
ఈ సినిమాను నువ్వు ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి రెండేళ్ల పాటు ఎంత కష్టపడ్డావు నాకు తెలుసు.నువ్వు రామ్, శీతా కథను ఎంతగా నమ్మావో నాకు తెలుసు.
ఒక ముత్యం లాంటి సినిమాల నిర్మించడమే కాకుండా సమాజంలో ఇంకా ప్రేమ ఉంది అన్న నమ్మకాన్ని కలిగించావు.నిజమైన ప్రేమ కోసం బ్రహ్మచారిగా నేను పరితపించేలా చేశావు అంటూ సాయి తేజ్ తన పోస్ట్ లో రాసుకొచ్చారు.
దర్శకుడు హను రాఘవపూడి,ఐ హేట్ యూ.నీవు ప్రతీ విభాగాన్ని అద్భుతంగా తెరకెక్కించావు.అలాగె ప్రతి ఫ్రేమ్ను దృశ్యకావ్యంలా మలిచి ఓ మ్యాజిక్ను ఆవిష్కరించావు.ప్రతీ క్యారెక్టర్ను అద్బుతంగా మలిచావు.
ప్రతీ సీన్లో నటీనటులు వందకు వంద శాతం తమ ప్రతిభను చూపించారు.వెండితెరపై అద్బుతమైన పెయింటింగ్ను, సంగీతాన్ని ఆవిష్కరించావు. సెకండాఫ్ సిండ్రోమ్ను అధిగమిస్తావని చెప్పి దాని తెరమీద నిరూపించుకొన్నావు.దుల్కర్ సల్మాన్ కూడాగతంలో నీ సినిమాలు చూసి నేను ఫెర్ఫార్మెన్స్కు అభిమానిని అయ్యాను.కానీ సీతారామంలో నీ ఫెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నీవు గొప్ప నటుడివి అనే ఫీలింగ్తో ఐ హేట్ యూ అనాలనిపించింది.ప్రతీ సీన్లో నీ ఫెర్ఫార్మెన్స్కు పడిపోయాను.
రామ్ పాత్రలో నీవు ఒదిగిపోయావు.రామ్ పాత్రను నీవు తప్ప మరొకరు చేయలేదనే ఫీలింగ్ను కల్పించావు అని సాయిధరమ్ తేజ్ చెప్పారు.
సీతా.నీ పేరుపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
అధికారుల నిబంధనలకు లోబడి ఉండు.మరోారి నీవు పారిపోవొద్దు.
ఎన్నో హృదయాలు ముక్కలవుతున్నాయి.వాళ్ల మీద కాస్త జాలి చూపండి.
నేను మరిచిపోకముందే ఐ హేట్ యూ అని ప్రేమగా పోస్టులో రాసుకొచ్చాడు సాయి ధరమ్ తేజ్.N
.