కింగ్ నాగార్జునతో ఆయన భార్త ఒకప్పటి హీరోయిన్ అమల అక్కినేని బాక్సాఫీస్ ఫైట్ కి సిద్ధమవుతున్నారు.అదేంటి అనుకోవచ్చు.
నాగార్జున బాలీవుడ్ లో నటించిన బ్రహ్మాస్త్ర సినిమా సెప్టెంబర్ 9న రిలీజ్ అవుతుంది.ఆ సినిమాకు పోటీగా శర్వానంద్ తెలుగు, తమిళ భాషల్లో చేస్తున్న ఒకే ఒక జీవితం సినిమా కూడా రిలీజ్ అవుతుంది.
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన ఒకే ఒక జీవితం సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాను శ్రీ కార్తీక్ డైరెక్ట్ చేశారు.
ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ మదర్ రోల్ లో అమల అక్కినేని నటించారు.మదర్ సెంటిమెంట్ తో టైం ట్రావెల్ కథగా ఒకే ఒక జీవితం సినిమా వస్తుంది.
ఇక బ్రహ్మాస్త్ర సినిమాలో నాగార్జున కూడా గెస్ట్ రోల్ చేశారు.రణ్ బీర్ కపూర్, అలియా భట్ కలిసి నటించిన ఈ బ్రహ్మస్త్ర సినిమాని తెలుగులో రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్నారు.
అనుకోకుండా నాగార్జునతో అమల అక్కినేని సినిమా పోటీకి రావడం విశేషం. తెలుగు సినిమాలు హిందీ బాక్సాఫీస్ దగ్గర దండయాత్ర చేస్తున్నాయి అందుకే బాలీవుడ్ మేకర్స్ కూడా వారి సినిమాలను తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.
ఆల్రెడీ ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా తెలుగులో రిలీజ్ అవుతుంది.ఇక ఇప్పుడు బ్రహ్మాస్త్ర కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.