రంగారెడ్డి జిల్లా:- ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అత్తాపూర్ లోని మంత్రా మాల్ థియేటర్ లో చిన్నారులతో కలిసి గాంధీజి చరిత్రను తెలిపే చలన చిత్రాన్ని విద్యార్థులతో కలిసి తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్, రంగా రెడ్డి జిల్లా డిప్యూటీ విద్యా అధికారులు వీక్షించారు.
ఈ సందర్భంగా సి.
ఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ….గాంధీజీ జీవన చరిత్ర తో పాటు ఇండిపెండెన్స్ మూమెంట్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నేడు 8 తేదీ నుంచి ఈనెల 22 తేదీ వరకు తెలంగాణలోని ఉన్న ప్రభుత్వ ప్రైవేటు స్కూల్ లలో ఉన్న సుమారు 22 లక్షల మంది విద్యార్థులకు గాంధీజీ చిత్రాన్ని తెలుగు మరియు హిందీ భాషల్లో కల్పిస్తున్నామని తెలిపారు.
విద్యార్థుల్లో ఉత్సాహ స్ఫూర్తిని చూసి ఎంతో సంతోషం కలిగిందని సోమేశ్ కుమార్ అన్నారు.