హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.తప్పులు చేసి వాటిని కప్పి పుచ్చుకునేందుకు కుల మతాలను అడ్డం పెట్టుకుంటున్నారని విమర్శించారు.
ఆంబోతుల్లా బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తుందని వ్యాఖ్యనించారు.సీఎం జగన్ ఉదాసీనంగా వ్యవహరించడం వలనే రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు లాంటి నేరాలు పెరిగిపోతున్నాయన్నారు.
చివరకు రౌడీలే పోలీసు అధికారులను చంపే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని పేర్కొన్నారు.