సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 11వ తేదీన కేబినెట్ భేటీ జరగనుంది.ప్రగతిభవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం కానున్నారు.
ఈ భేటీలో ప్రధానంగా అదనపు ఆర్థిక వనరులు సహా ఇతర అంశాలపై చర్చించనున్నారు.కొత్త పింఛన్లు, డయాలసిస్ రోగులకు ఆసరా పింఛన్లు, అనాథ పిల్లల సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలు, స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలు విడుదలపై మంత్రివర్గం చర్చించనుంది.
అదేవిధంగా శాసనసభ ప్రత్యేక సమావేశం, స్థానిక సంస్థల సమావేశాలపై కూడా కేసీఆర్ చర్చించనున్నారు.