బ్రిటన్ వెళ్లిన శ్రీలంక క్రీడాబృందంలో కలకలం రేగింది.బర్మింగ్ హామ్ లో నిర్వహించిన కామన్వెల్త్ క్రీడలకు వెళ్లిన 10 మంది కనిపించకుండా పోయారు.
వారిలో నలుగురు అథ్లెట్లు, మిగిలిన వారు జట్టు అధికారులు ఉన్నారు.కామన్వెల్త్ క్రీడలు ముగిసిన అనంతరం వారంతా తమ లగేజీని వదిలి వెళ్లిపోయినట్లు గుర్తించారు.
శ్రీలంక అధికారుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బర్మింగ్ హామ్ పోలీసులు ముగ్గురు అథ్లెట్ల ఆచూకీని కనుగొన్నారు.శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరిన నేపథ్యంలో క్రీడా బృందంలోని సభ్యులు బ్రిటన్ లో ఉండిపోయేందుకు ఇలా చేసి ఉంటారని పలు వాదనలు వినిపిస్తున్నాయి.
వారి వద్ద 6 నెలల వరకు చెల్లుబాటు అయ్యే వీసాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.