వీఆర్ఏల బదిలీపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.56 మంది వీఆర్ఏలను బదిలీ చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 121 ను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిల్ ను విచారణకు న్యాయస్థానం స్వీకరించింది.ఇప్పటివరకు వీఆర్ఏలు అందరూ జాయిన్ అయ్యారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు.56 మంది మాత్రమే ఇంకా పోస్టింగ్ లో జాయిన్ కాలేదని ఏజీ అన్నారు.ఈ నేపథ్యంలో 56 మందిని రెవెన్యూ శాఖలో కొనసాగించాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేశారు.
అయితే రెండేళ్లుగా ఖాళీగా ఉన్న వీఆర్ఏలను ఇతర శాఖల్లోకి బదిలీ చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదంగా మారిన విషయం తెలిసిందే.