క్రికెట్ అభిమానులకు, ముఖ్యంగా ఐపీఎల్ చూసే వారికి క్రిస్ గేల్ పేరు తెలియకుండా ఉండదు.క్రీజులో గేల్ ఆడుతున్నాడంటే చాలా మంది టీవీలకు అతుక్కుపోతారు.
కొంత కాలంగా క్రికెట్కు దూరంగా ఉన్న గేల్ మరలా మైదానంలో అడుగు పెట్టనున్నాడు.లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) యొక్క రాబోయే రెండవ సీజన్ చాలా ఉత్సాహంగా ఉండబోతోంది.
దీనిలో ఇప్పుడు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ కూడా ఆడనున్నట్లు ప్రకటించాడు.క్రిస్ గేల్ టీ20 ఫార్మాట్లో అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మెన్గా పరిగణించబడ్డాడు.ఈ ఫార్మాట్లో అతని పేరు మీద లెక్కలేనన్ని రికార్డులు ఉన్నాయి.10,000 కంటే ఎక్కువ పరుగులు, అత్యధిక సెంచరీలు, ఫాస్టెస్ట్ సెంచరీ, అత్యధిక ఫోర్లు, సిక్సర్ల రికార్డులు ఆయన పేరు మీదే ఉన్నాయి.
క్రిస్ గేల్స్ అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులు నెలకొల్పాడు.వెస్టిండీస్ కోసం 103 టెస్ట్ మ్యాచ్లలో 7 వేల కంటే ఎక్కువ పరుగులు చేశాడు.ఇందులో 15 సెంచరీలు ఉన్నాయి.టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 333 పరుగులు.అవి శ్రీలంకపై నమోదు చేశాడు.గాలే టెస్టులో తన అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించాడు.
టెస్ట్ క్రికెట్లో 2 ట్రిపుల్ సెంచరీలు సాధించిన ప్రపంచ క్రికెట్లో నాలుగో ఆటగాడు క్రిస్ గేల్.లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్లో పాల్గొనడం గురించి గేల్ తన ప్రకటనలో చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పాడు.
ప్రపంచ క్రికెట్లోని చాలా మంది గొప్ప ఆటగాళ్లతో పాటు తాను ఇప్పుడు ఈ లీగ్లో భాగం కాబోతున్నానని పేర్కొన్నాడు.ఇందులో ఆడే అవకాశం వస్తుందని చెప్పాడు.
త్వరలో మైదానంలో కలుద్దామంటూ అభిమానులకు సందేశం ఇచ్చాడు.లెజెండ్స్ క్రికెట్ లీగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా కూడా క్రిస్ గేల్ ఆడనున్నట్లు ధ్రువీకరించాడు.
క్రిస్ రాకతో, ఈ లీగ్ పరిధి చాలా పెద్దదిగా మారిందని తెలిపాడు.సెకండ్ సీజన్లో అభిమానులు మరింత ఆనందాన్ని పొందుతారని ఖచ్చితంగా భావిస్తున్నట్లు చెప్పాడు.
ఇటీవలే ఆ లీగ్లో తాను ఆడనున్నట్లు భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు.దీంతో ఎందరో లెజెండ్ క్రికెటర్లు మరో సారి మైదానంలో బరిలోకి దిగనున్నారు.