ప్రెసెంట్ మన టాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఆందోళనగా ఉంది.ఈ పరిస్థితులు చక్కబడే వరకు కొద్దీ రోజులు షూటింగులు వాయిదా వేయాలని స్వచ్చంధంగా నిర్ణయం తీసుకున్నారు.
అయితే ఈ నిర్ణయం విమర్శలకు దారి తీస్తుంది.ఆగష్టు 1 నుండి షూటింగులు నిలిపి వేయడంతో కొంతమంది విమర్శలు చేస్తున్నారు.
టాలీవుడ్ లో ఇద్దరు ప్రొడ్యూసర్స్ మాత్రం షూటింగ్ వాయిదా వేయకుండా తమిళ్ సినిమాలంటూ చెప్పుకుంటూ షూటింగులు చేసుకుంటున్నారు.
ఈ డబుల్ స్టాండ్ పై అందరి మండి పడుతున్నారు.
గిల్ట్ నిర్మాతల మండలి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అంతా ఒక్కటే అయినా కూడా ఇలా డబుల్ స్టాండ్ ఎందుకని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే ఈ విషయంపై ఇద్దరుముగ్గురు బాహాటంగానే తమ విమర్శలు తెలుపగా.
ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ బంద్ పై సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.
నందమూరి సీనియర్ హీరో బాలయ్య ఈ బంద్ విషయంలో నిర్మాతలకు సీరియస్ వార్ణింగ్ ఇచ్చారట.
ఈ స్ట్రైక్ కారణంగా ఈయన షెడ్యూల్ తారుమారు అవుతుంది.అందుకే ఎట్టిపరిస్థితుల్లో ఆగష్టు 9 లోగ ఈ బంద్ విషయంలో ఏదో ఒకటి తేల్చాలంటూ నిర్మాతలకు ఈయన సీరియస్ అల్టిమేటం జారీ చేసారని టాక్.
ఈయన వార్ణింగ్ కు ఎదురు చెప్పే ధైర్యం ఏ నిర్మాతకు లేదు.అందుకే ఏం చేయాలో.
ఎలా చెప్పాలో తెలియక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారని తెలుస్తుంది.
మరి చివరకు ఈ బంద్ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఎలా స్పందిస్తుందో చూడాలి.ప్రెజెంట్ బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాను స్టార్ట్ చేసాడు.మైత్రి మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఈ యువ దర్శకుడు హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నాడు.
కర్నూల్ లో షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా బంద్ కారణంగా వాయిదా పడింది.ఇది పూర్తి కాగానే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయాలనీ చూస్తున్నాడు.
అలాగే ఈ మధ్యలోనే అన్ స్టాపబుల్ 2 కూడా స్టార్ట్ కాబోతుంది.మరి ఈ రెండు షెడ్యూల్స్ క్యాన్సిల్ కాకుండా ఉండాలంటే మైత్రి దిగి రావాల్సిందే.