టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ సినిమాతో నాలుగేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో నందమూరి అభిమానులు ఖుషీగా ఉన్నారు.
అయితే ఇది మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా విజయాన్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేయలేక పోయారు.
అందుకే తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.
మరి ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.
ఇప్పటికే NTR30 నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాడు.అయితే సినిమాను అనుకున్న సమయానికి సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోతున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాపై చాలా రకాల రూమర్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఈ సినిమాను పక్కన పెట్టేశారని కూడా వార్తలు వచ్చాయి.మరి ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ ఈ సినిమాపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టారు.ఈ సినిమా లేట్ అవుతుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారని తెలుసు.
ట్రిపుల్ ఆర్ సినిమా ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.ఈ అంచనాలను చేరుకునేలా ఈ సినిమాను గ్రాండ్ గా చేయాల్సి ఉందని కళ్యాణ్ రామ్ తెలిపారు.
మరి కొరటాల కూడా ఇదే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రెసెంట్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్న కొరటాల ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్.ఇక ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.చూడాలి ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో.