టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నాగచైతన్య నటిస్తున్న థాంక్యూ సినిమా ఈ నెల 22వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.చైతన్య, రాశీఖన్నా ఇప్పటికే మనం.
వెంకీ మామ సినిమాల్లో కలిసి నటించారు.మనం సినిమాలో రాశీఖన్నా గెస్ట్ రోల్ లో నటించినా ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ సమంత అనే సంగతి తెలిసిందే.
థాంక్యూ ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య, రాశీఖన్నా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రాశీ ఖన్నా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుందని షూట్ కు వెళ్లినప్పుడు ఖాళీ సమయం దొరికితే నేను, రాశీ ఖన్నా సరదాగా ముచ్చటించుకుంటామని చైతన్య చెప్పుకొచ్చారు.
సినిమాల గురించి, ఇష్టాయిష్టాల గురించి మేము చర్చించుకుంటామని చైతన్య పేర్కొన్నారు.నాతో ఎవరైనా మాట్లాడిన సమయంలో మొదటి రెండు నిమిషాలు వాళ్లు మాట్లాడిన మాటలు మాత్రమే నాకు గుర్తుంటాయని చైతన్య తెలిపారు.
రెండు నిమిషాల తర్వాత అవతలి వ్యక్తులు ఏం చెప్పినా పట్టించుకోనని ఆ విషయాలు నాకు గుర్తుండవని చైతన్య వెల్లడించారు.రాశీ ఖన్నా చైతన్య గురించి మాట్లాడుతూ చైతన్యకు రోడ్ ట్రిప్స్ అంటే ఇష్టమని సైట్ వల్ల చైతన్య కళ్లద్దాలను వాడుతున్నారని తెలిపారు.చైతన్యకు సైట్ ఉందనే విషయం అభిమానులలో చాలామందికి తెలియదు.చైతన్యకు సంబంధించిన షాకింగ్ సీక్రెట్ ను రాశీఖన్నా వెల్లడించారు.చైతన్య దగ్గర మూడు ఖరీదైన కార్లు ఉన్నాయని రాశీ ఖన్నా చెప్పుకొచ్చారు.చైతన్య, రాశీ ఖన్నా థాంక్యూ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి.
అవికా గోర్, మాళవికా నాయర్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.థాంక్యూ సినిమాతో చైతన్య ఖాతలో సక్సెస్ చేరుతుందేమో చూడాల్సి ఉంది.
చైతన్య తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.