వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైం ఆ పార్టీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తుంది.గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణం ఎదురుగా రేపు ఎల్లుండి జరగబోయే ఈ ప్లీనరీ సమావేశానికి రాష్ట్ర నలుమూలల నుండి భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు హాజరవుతున్నారు.
గత సంవత్సరాలు కరోనా కారణంగా ప్లీనరీ నిర్వహించలేకపోయారు.దీంతో ప్రస్తుతం జరుగుతున్న ప్లీనరీ సమావేశాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
అయితే ఈ సమావేశానికి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వస్తారా లేదా అన్న చర్చ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే.ఇదే విషయంపై ప్రతిపక్ష పార్టీ టిడిపి కూడా నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంది.
ఇటువంటి తరుణంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందిస్తూ కచ్చితంగా అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ప్లీనరీ సమావేశానికి హాజరవుతారని క్లారిటీ ఇచ్చారు. ముఖ్య అతిథులుగా ఎవరిని పిలవడం లేదని.
అన్నారు.ప్రజలకు చేసిన మేలుని ఈ సమావేశంలో తెలియజేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
ప్లినరీ సమావేశంలో చేయబోయే అభివృద్ధిని.తీర్మానాలకు ఆమోదం తెలుపుతామని స్పష్టం చేశారు.