వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు లెటర్ రాస్తూ వైసిపి పార్టీకి చెందిన ఎంపీలందరికీ పంపించడం జరిగింది.ఏకంగా నాలుగు పేజీల లెటర్ రాసి.
తన సహచర పార్టీ పార్లమెంటు సభ్యులందరికీ పంపించడం జరిగింది.ఆ లెటర్ లో సీఎం జగన్ పై అనేక ఆరోపణలు చేశారు.
గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ పార్టీ తరఫున నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీ చేసిన రఘురామకృష్ణరాజు గెలిచి.అనంతరం పార్టీకి వ్యతిరేకంగా మారారు.
సీఎం జగన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు విషయంలో ఆయన వ్యతిరేకంగా మాట్లాడటం తో పార్టీ.అధినేతల సైతం రఘురామకృష్ణరాజుని పక్కన పెట్టేశారు.
అంత మాత్రమే కాదు ఏపీ సిఐడి పోలీసులు ఆయనపై కేసు కూడా గతంలో నమోదు చేయటం అరెస్టు కూడా చేశారు.ఆ సమయంలో తనని పోలీసులు జైల్లో చిత్రవాదులకు గురి చేశారని కొట్టారని.
పలు సందర్భాలలో రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.అయితే ఇప్పుడు సీఎం జగన్ నుండి తనకి ప్రాణహాని ఉందని లెటర్ రాయడం అది కూడా వైసీపీ ప్లీనరీ సమావేశానికి ముందు రోజు రాయడం రాజకీయంగా సంచలనం రేపుతోంది.