తెలంగాణ ప్రాంతంలో బుధవారం రాత్రి పటాన్ చెరులో కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం తెలుసుకొని పోలీసులు వెళ్లే కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది.అయితే ఈ కోడి పందాలను దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిర్వహిస్తున్నట్లు.
ఆయన పరారైనట్లు పోలీసులు చెప్పవచ్చారు.ఈ క్రమంలో తనపై వస్తున్న వార్తలు విషయంలో.
చింతమనేని సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
కోడిపందాలలో లేని వ్యక్తిని ఉన్నట్టు చూపడం తగదంటూ ఓ ప్రముఖ దినపత్రిక ఉద్దేశించి పేర్కొన్నారు.
అంతేకాకుండా ఇంత రాక్షస రాజకీయం అవసరమా అని కూడా ప్రశ్నించారు. ఇదంతా రాజకీయ కుట్ర.
నీచమైన ప్రచారంతో తెలుగు ప్రజల్లో విష బీజాలు నాటాలని చూస్తున్నారు.నాపై అసత్యాలు రాసే పత్రికలనీ ప్రజలే చూసుకుంటారని సమయం ఆసన్నమైందని తనదైన శైలిలో సోషల్ మీడియాలో చింతమనేని రియాక్ట్ అయ్యారు.
ఇదిలా ఉంటే చింతమనేని ప్రభాకర్ కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు తమ దగ్గర వీడియో ఉందని.త్వరలో బయటపెడతామని తెలంగాణ పోలీసులు చెబుతున్నారు.
చింతమనేని పట్టుకోడానికి మూడు బృందాలు గాలింపులు చేస్తున్నట్లు కూడా స్పష్టం చేశారు.