టాలీవుడ్ నటుడు నరేష్ తన 40 ఇయర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ కెరియర్ లో సంపాదించుకున్న పరువు మొత్తం గంగలో కలిసిపోయినట్టు అయింది.పవిత్ర లోకేష్, నరేష్ లవ్ మధ్య ఏదో వ్యవహారం నడుస్తోంది అంటూ గత రెండు వారాలుగా వార్తలు కొనసాగుతూనే వినిపిస్తూనే ఉన్నాయి.
నిత్యం వీరికి సంబంధించిన ఏదో ఒక వార్త వెలుగులోకి వస్తూనే ఉంది.అయితే ఈ వ్యవహారం గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపించనంతవరకు అతని గురించి గొప్పగా చెప్పిన ఎంతోమంది ప్రస్తుతం అతనికి సపోర్ట్ గా మీడియాకు ముందుకు రావాలి అంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొన్నాయి.
అంతేకాకుండా మా ఎలక్షన్స్ లో గెలిచిన మంచు విష్ణు కూడా నరేష్ తరపున వచ్చి మీడియా ముందు మాట్లాడే లేకపోతున్నారు.
అయితే ప్రతి ఒక్కరు కూడా పర్సనల్ మేటర్స్ లో తల దూర్చడం సవ్వం కాదు అని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే నరేష్ తరుపున ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నేను మాట్లాడుతాను అంటూ ముందుకు వచ్చింది సీనియర్ నటి పూజిత.ఈమె నరేష్ గురించి సమాధానం చెప్పడానికి ఏకంగా కర్ణాటక కు వెళ్లి అక్కడ మీడియా వాళ్ళు రాస్తున్న వార్తలను ఖండిస్తూ నరేష్ తరపున మాట్లాడింది.నరేష్ గురించి పూజిత మాట్లాడుతూ.నరేష్ ఉమెనైజర్ అయితే నేను కొన్ని సంవత్సరాల ముందు వరకూ హీరోయిన్గానే ఉన్నాను,అనేక సినిమాలు చేశాను, నేను బాగానే ఉన్నాను కదా, నా ముక్కు మొహం అన్నీ బాగానే ఉన్నాయి అందుకే నన్ను హీరోయిన్గా తెలుగులోనే కాకుండా కర్ణాటకలో కూడా ఆదరించారు.
నరేష్తో కలిసి నేను పనిచేశాను.
నిజంగా ఆయన ఉమెనైజర్ అయితే నన్ను కూడా అడగాలి కదా నరేష్ ఉమెనైజర్ అయితే పూజా ఎక్కడికైనా వెళ్దాం అని అడిగేవారు కదా.కానీ ఆయన అలా చేయలేదు.నాకు ఆరోగ్యం బాలేక ఆసుపత్రి పాలైతే ఆ సమయంలో నన్ను నరేష్ గారు ఆదుకున్నారు.
నేను ఈరోజు ప్రాణాలతో ఉన్నానంటే ఆయనవల్లే ఆరోజు ఆయన నాకు సాయం చేశారు కాబట్టి ఆయన తరుపున మాట్లాడటం లేదు.కేవలం నేను మాత్రమే కాకుండా నాలాగే ఆయన వల్ల సాయం పొందిన వాళ్లు వెయ్యి నుంచి పదిహేను వందల మంది ఉన్నారు.
ఇది ఎవ్వరికీ తెలియదు.నాకు మాత్రమే తెలుసు.
అయితే ఇదే విషయాన్ని నేను కెమెరా ముందు చెప్పాలనుకున్నప్పుడు కూడా ఆయన వెనుక నుంచి వద్దు పూజా నువ్ ఒక హీరోయిన్వి డీగ్రేడ్ అవుతావ్ అని అన్నారు అని నరేష్ గురించి గొప్పగా చెప్పుకొచ్చింది పూజిత.నరేష్ అన్నయ్య గురించి వస్తున్న వార్తలను ఖండించడానికి కర్ణాటక వెళ్లాను మీడియాతో మాట్లాడాను.అయితే నిజానికి నేను షూటింగ్లో ఉన్నాను.ఈ విషయం తెలిసిన తరువాత నేను వెంటనే కర్ణాటక వెళ్లి నా బ్రదర్కి జరుగుతున్న అన్యాయంపై మాట్లాడాలని అనుకున్నాను.దీని వల్ల నాకు వచ్చేది ఏమీ లేదు కేవలం మానవత్వంతోనే స్పందిస్తున్నా నా లాంటి వాళ్లు బతికి ఉండాలంటే మా బ్రదర్ బతికి ఉండాలి అని తెలిపింది నటి పూజిత.