టాలీవుడ్ హీరో గోపీచంద్ హీరోయిన్ రాశి ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్.ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
ఈ సినిమా మంచి విజయం సాధించడంతో చిత్ర బృందం ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా పలు విషయాలను చెప్పుకొచ్చింది.
నిజానికి తాను ఐపీఎస్ కావాలి అని కలలు కన్నానని కానీ అనుకోకుండా హీరోయిన్ అయ్యాను అని తెలిపింది రాశి ఖన్నా.
దేవుడు తన డెస్టిని డిసైడ్ చేసి సినిమాల్లోకి తీసుకువచ్చి తన లైఫ్ ని సెట్ చేశారని అంటుంది ఈ ముద్దుగుమ్మ.
అంతేకాకుండా ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలలోకి వచ్చి హీరోయిన్ గా రాణిస్తున్నాను అంటే అదంతా దేవుడి దయతోనే అని అంటుంది.ఇది ఒకప్పుడు ఐఏఎస్ కావాలని అనుకున్నాను కానీ దానికంటే హీరోయిన్ కావడమే బెటర్ గా ఉందని అంటుంది.
ఐఏఎస్ అయితే ప్రజలకు సేవ చేయవచ్చు అనుకున్నాను ఇప్పుడు హీరోయిన్ అయి ప్రజలకు సేవ చేస్తున్న ఈ రెండు ఈక్వల్ అంటూ సింపుల్ గా చెప్పేసింది ఈ ముద్దుగుమ్మ.
రాశిఖన్నా విషయానికి వస్తే మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకుంది.ఇక తెలుగులో ఆక్సిజన్,తొలిప్రేమ, శివమ్,సుభాష్, జిల్,జోరు,హైపర్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.రాశి ఖన్నాకు యూత్ లో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం తెలిసిందే.
ఈమె సోషల్ మీడియాలో ఫోటో షేర్ చేసింది అంటే చాలు లక్షల్లో లైకులు కామెంట్స్ వస్తూ ఉంటాయి.