తెలుగు ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.రంగుల ప్రపంచంలో ఎవరి ముఖం చూసిన ఎంతో ఆనందంగా కనిపిస్తూ ఉంటుంది.
దీంతో ఈ సినిమా వాళ్లకి అసలు బాధలు ఉండవు అని అనుకుంటారు చాలామంది.కానీ సినిమా వాళ్ళని ఒక్కసారి కదిలిస్తే కన్నీళ్లు పెట్టించే బాధలు ఉంటాయి అన్నది చాలామందికి తెలియదు.
ఇలా వెండితెరపై అలరిస్తూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే ఎంతో మంది సెలబ్రెటీలు భర్తలను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు.ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
జయసుధ :
ఎన్టీఆర్ ఏఎన్నార్ కాలంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగి సహజనటిగా గుర్తింపు సంపాదించుకుంది జయసుధ. అయితే 2017 లో తన భర్త నితిన్ కపూర్ చనిపోవడంతో ఒంటరిగా అయిపోయింది.
సుమలత :
శుభలేఖ సినిమాకు ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న సుమలత చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించింది.కన్నడ స్టార్ అంబరీష్ పెళ్లి చేసుకోగ 2018 ఆయన చనిపోయారు.
మీనా :
చంటి, సుందరకాండ, ముఠామేస్త్రి ఇలా చెప్పుకుంటూ పోతే మొన్నటికి మొన్న దృశ్యం 2 లాంటి సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్న మీనా ఇటీవలే తన భర్త విద్యాసాగర్ హఠాత్ మరణం పొందడంతో దుఃఖంలో మునిగి పోయింది
భానుప్రియ :
ఒకప్పుడు హీరోయిన్ గా లో ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్న భానుప్రియ ఆదర్శ కౌశల్ ను పెళ్లాడింది.కాగా ఆయన 2005 లో మరణించాడు.
రోహిణి :
ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలో నటించిన రోహిణి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది.అయితే 2008లో భర్త రఘువరన్ ను కోల్పోయింది.
సురేఖ వాణి :
సినిమాల్లో నటిగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న సురేఖ వాణి పెళ్ళైన కొన్నేళ్లలోనే భర్త సురేష్ ను కోల్పోయింది.
డిస్కో శాంతి :
ఒకప్పుడు ప్రత్యేక గీతాల్లో నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించుకున్న డిస్కో శాంతి రియల్ స్టార్ శ్రీహరి ని పెళ్లి చేసుకుంది.అయితే ఆయన 2013లో చనిపోయారు.
మేఘనారాజ్ :
కన్నడ మలయాళ చిత్ర పరిశ్రమలో గుర్తింపు సంపాదించుకున్న మేఘన రాజ్ భర్త చిరంజీవి సర్జ 2020 లో కన్నుమూశారు.
తాజా వార్తలు