మారుతి డైరెక్షన్ లో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన పక్కా కమర్షియల్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా గురించి ప్రేక్షకుల నుంచి నెగిటివ్ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
రొటీన్ మాస్ మసాలా కథతో ఈ సినిమా తెరకెక్కడంతో ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకునే అవకాశం అయితే లేదనే సంగతి తెలిసిందే.
భారీ స్థాయిలో బిజినెస్ చేసిన ఈ సినిమా ఫుల్ రన్ లో అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కావడం కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
అయితే పక్కా కమర్షియల్ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో మారుతికి ప్రభాస్ భారీ షాక్ ఇవ్వబోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ మారుతి కాంబో మూవీ ఇప్పట్లో మొదలయ్యే అవకాశాలు అయితే లేవని సమాచారం అందుతోంది.
స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ నిర్మాతగా ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కే సినిమా తెరకెక్కుతోంది. ప్రాజెక్ట్ కే సినిమా రిలీజ్ కు ముందు లో, మీడియం బడ్జెట్ల సినిమాలు చేయవద్దని ఆయన ప్రభాస్ కు సూచనలు చేశారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.మరోవైపు ప్రభాస్ గత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు.ఇలాంటి సమయంలో ప్రభాస్ రిస్క్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేరు.
ఈ ప్రాజెక్ట్ విషయంలో ప్రభాస్ అభిమానులు కూడా సంతోషంగా లేరని సమాచారం అందుతోంది.వైరల్ అవుతున్న కామెంట్ల గురించి ప్రభాస్, మారుతి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.ప్రభాస్, మారుతి తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సినిమాసినిమాకు ప్రభాస్ రేంజ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే.