టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రెసెంట్ ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు పొందాడు.ఈయన నటించిన ట్రిపుల్ ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.
ఈ సినిమాను రాజమౌళి డైరెక్ట్ చేయడంతో ముందు నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.ఆ అంచనాలు నిజం అయ్యేలా బిగ్గెస్ట్ హిట్ గా ఈ సినిమా నిలిచి 1100 కోట్లు కొల్లగొట్టింది.
ఇందులో చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటించారు.
ఈ సినిమాతో హిట్ కొట్టిన రామ్ చరణ్ అదే జోష్ లో మరో అగ్ర డైరెక్టర్ శంకర్ తో సినిమా స్టార్ట్ చేసాడు.
ఇండియన్ అగ్ర దర్శకులు అయినా రాజమౌళి, శంకర్ లతో ఈయన బ్యాక్ టు బ్యాక్ పని చేసి రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.మెగా ఫ్యాన్స్ అంతా ఆర్సీ 15 సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇటీవలే అమృత్ సర్ లో ఈ సినిమా షూటింగ్ ముగించుకుంది.
ఆ తర్వాత వైజాగ్ బీచ్ లో షూటింగ్ జరుపుకుంది.
ఇక ఇక్కడ కూడా షూటింగ్ ముగించు కున్నారు.త్వరలోనే మరో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది.
అయితే శంకర్ సినిమా అంటే ఆయన ముందు నుండే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈయన అంత పర్ఫెక్ట్ గా సినిమా ప్లాన్ చేసుకుని చేస్తాడు కాబట్టే ఆయన సినిమాలు వరల్డ్ ఫేమస్ అయ్యాయి.
ఇక ఇప్పుడు ఆర్సీ 15 కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకుంటున్న శంకర్ ఇంకా నెక్స్ట్ రాబోయే కొన్ని కీలక షెడ్యూల్స్ కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకోబోతున్నాడట.ఈయన టైట్ సెక్యూరిటీ తో రాబోయే షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.ఈ షెడ్యూల్స్ లో నటీనటుల లుక్స్ తో పాటు సన్నివేశాలు కూడా చాలా కీలకం కాబట్టి సెక్యూరిటీని పెట్టనున్నట్టు తెలుస్తుంది.
మరి ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకున్నారు.ఇక దిల్ రాజు ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
ఈ సినిమాలో కీలక పాత్రల్లో సునీల్, అంజలి వంటి వారు నటిస్తున్నారు.