గన్నవరం టిక్కెట్ వంశీకే..అంటూ కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!!

వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కృష్ణాజిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఎవరికి అన్నదానిపై రకరకాల డిస్కషన్స్ వైసీపీలో జరుగుతున్న సంగతి తెలిసింది.2019 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసిన యార్లగడ్డ వెంకట్రావు.వైసీపీ తరపున పోటీ చేసి అప్పటి టీడీపీ క్యాండెట్ వల్లభనేని వంశీ చేతిలో ఓడిపోయారు.ఆ తర్వాత వల్లభనేని వంశీ.

 Gannavaram Ticket Confirm To Vamsi Kodali Nani Sensational Comments  Vallabhanen-TeluguStop.com

వైసీపీ లోకి రావటంతో గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితి మొత్తం మారిపోయింది.

ఈ క్రమంలో వల్లబనేని వంశీ.

వైసీపీలోకి వచ్చినా గాని.యార్లగడ్డ వెంకట్రావు.

మద్దతుదారులకి.వంశి అనుచరులు మధ్య విభేదాలు వస్తూనే ఉన్నాయి.

అంతమాత్రమే కాదు 2024 ఎన్నికలలో మళ్లీ వైసీపీ టికెట్ తరపున పోటీ చేస్తానని యార్లగడ్డ ప్రకటించడం జరిగింది.పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల గన్నవరంలో కృష్ణా జిల్లా పార్టీ ప్లీనరీ సమావేశంలో.మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.2024 ఎన్నికలలో మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైసీపీ నుండి పోటీ చేసేది సిట్టింగ్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అని స్పష్టం చేశారు.ఇదే క్రమంలో నాయకుల మధ్య ఎటువంటి విభేదాలు ఉన్న సీఎం జగన్ పిలిచి మాట్లాడతానని చెప్పినట్లు తెలిపారు.కొడాలి నాని ప్రకటనతో యార్లగడ్డ వెంకట్రావు వర్గం  డైలమాలో పడిపోయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube