ప్రముఖ నటి పవిత్ర లోకేశ్ నరేష్ పెళ్లి చేసుకోనున్నారని గత కొన్నిరోజులుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.వైరల్ అయిన వార్తల గురించి పవిత్ర లోకేశ్ నుంచి క్లారిటీ వస్తే బాగుంటుందని ఆమె అభిమానులు భావించారు.
ఒక మీడియా ఛానల్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ లో పవిత్ర లోకేశ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.సీనియర్ నరేష్ ఫ్యామిలీ మెంబర్స్ సైతం నన్ను వాళ్ల ఫ్యామిలీ మెంబర్ గా ఒప్పుకున్నారని ఆమె తెలిపారు.
సూపర్ స్టార్ కృష్ణ, ఆయన కుటుంబం నుంచి మా ఇద్దరి సహజీవనానికి ఆమోదం ఉందని త్వరలో నేను, నరేష్ పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నామని ఆమె చెప్పుకొచ్చారు.నరేష్ మూడో భార్య మాటతీరు, ప్రవర్తన నాకు నచ్చలేదని ఆమె కామెంట్లు చేశారు.
నరేష్ మూడో భార్య వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఉన్నాయని భర్తతో కలిసి ఉండనని ఆమె చెప్పిందని పవిత్ర లోకేశ్ కామెంట్లు చేశారు.సుచేంద్ర ప్రసాద్ ను నేను పెళ్లి చేసుకోలేదని చెబుతూ పవిత్ర లోకేశ్ బాంబు పేల్చారు.
మేము సహజీవనం చేశామని అఫీషియల్ గా పెళ్లే జరగలేదని పెళ్లి జరగని పక్షంలో విడాకులు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుందని ఆమె చెప్పుకొచ్చారు.నరేష్ లైఫ్ లో నాకు చోటు దక్కితే చాలని నరేష్ మూడో భార్యతో ఏవైనా సమస్యలు ఏర్పడితే మాట్లాడి పరిష్కరించుకుంటానని పవిత్ర లోకేశ్ వెల్లడించారు.నరేష్ మోసం చేశాడని నాకు అనిపించలేదని నరేశ్ అబద్ధాలు చెప్పడని ఆమె కామెంట్లు చేశారు.పవిత్ర లోకేశ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.నరేష్ తో పెళ్లి నిజమేనని ఆమె డైరెక్ట్ గా క్లారిటీ ఇవ్వడంతో ప్రేక్షకులను వెంటాడుతున్న అన్ని ప్రశ్నలకు జవాబు దొరికింది.అయితే నరేష్ పవిత్ర లోకేశ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో చూడాల్సి ఉంది.