వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పై ఏపీ ప్రభుత్వం పెట్టిన రాజద్రోహం కేసు విషయంలో… విచారణకు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.హైదరాబాద్ లోని దిల్ ఖుష్ గెస్ట్ హౌస్ లో… రఘురామరాజు లాయర్ సమక్షంలోనే విచారణ జరగాలని సీఐడీకి కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
సీఐడీ కార్యాలయానికి పిలిపించ కూడదని.కేవలం కేసుకు సంబంధించి ప్రశ్నలు మాత్రమే వేయాలని హైకోర్టు.
స్పష్టం చేయడం జరిగింది.
ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.ఇదే సమయంలో ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విచారణ జరిపించాలని తెలిపింది. రాజా ద్రోహం కేసు కారణంగా రఘురామకృష్ణరాజు.దాదాపు ఏడాదికి పైగానే.రాష్ట్రం లోకి రాకుండా ఢిల్లీలోనే ఉండే పరిస్థితి నెలకొంది.ఇదిలాఉంటే ఇటీవల మోడీ రాష్ట్ర పర్యటన క్రమంలో తనకు అనుమతి ఇవ్వాలని.
భద్రత కల్పించాలని.రఘురామకృష్ణరాజు కేంద్రహోంశాఖ ని.కోరడం జరిగింది.ఇటువంటి తరుణంలో ఏపీ హైకోర్టు సీఐడీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం రాజకీయంగా సంచలనం రేపింది.