యాదాద్రి జిల్లా:నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం సాయంత్రం చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు.చౌటుప్పల్ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం మహబూబాబాద్ కు చెందిన ధూనం అరవింద్, ఒడిషా రాష్ట్రం మాలకాంగిరి జిల్లాకు చెందిన పప్పుల తిరుపతి,అప్పారావులు ఒక ముఠాగా ఏర్పడి అక్రమంగా గంజాయిని సరఫరా చేస్తున్నారు.
ఈ క్రమంలో హైదారాబాద్ కు చెందిన కాలా సాహెబ్ ఇచ్చిన ఆర్డర్ మేరకు ధూనం అరవింద్,పప్పుల తిరుపతిలు కలిసి కారులో 28 కిలోల గంజాయిని ఒడిషా రాష్ట్రం నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్ కు తరలిస్తున్నారు.పక్కా సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు మంగళవారం సాయంత్రం రెడ్డిబావి వద్ద వాహనాలు తనిఖీ నిర్వహించి ప్రభుత్వం నిషేధించిన గంజాయిని, అక్రమంగా తరలిస్తున్న అరవింద్,తిరుపతి లను అరెస్టు చేసి విచారించగా ముఠా గుట్టురట్టయ్యింది.ఈ మేరకు అరవింద్,తిరుపతిలను అరెస్టు చేసి,వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని,వారి నుంచి కారు,రెండు సెల్ ఫోన్లు,రూ.13,800/-నగదు,28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని బుధవారం సిఐ శ్రీనివాస్ తెలిపారు.