కన్నడ హీరో యశ్ గురించి మూడు సంవత్సరాల వరకు ఎవరికి తెలియదు.ఆయన హీరోగా సూపర్ హిట్ అయినా కూడా కేవలం కన్నడం వరకే పరిమితం అయ్యాడు.
ఎప్పుడైతే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ సినిమా ను చేశాడో అప్పటి నుండి ఆయన గొప్ప హీరో అన్నట్లుగా మారి పోయాడు.హీరోగా కన్నడం లోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపును దక్కించుకున్నాడు.
తాజాగా కేజీఎఫ్ 2 సినిమా వచ్చింది.ఆ సినిమా ఏకంగా వెయ్యి కోట్ల కు పైగా వసూళ్లు సాధించడం తో యశ్ తదుపరి సినిమా పై అంచనాలు భారీ గా ఉన్నాయి.
అసలు యశ్ ఏ సినిమా చేస్తాడు.ఎవరితో చేస్తాడు అనే విషయమై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.
కన్నడం లో సినిమా చేస్తే ఒక వేళ చిన్న దర్శకుల తో చేయాల్సి వస్తుంది.
అప్పుడు మళ్లీ కన్నడం వరకే తన సినిమా లు ఆడుతాయి.
కాని ఇప్పుడు యశ్ పాన్ ఇండియా రేంజ్ లో సినిమా చేయాలి అనుకుంటున్నాడు.అందుకే ఆయన కన్నడం లో ఉన్న దర్శకులను కాకుండా తెలుగు మరియు తమిళ దర్శకుల వైపు ఆసక్తిగా చూస్తున్నాడట.
ఇద్దరు ముగ్గురు కన్నడ దర్శకులు కథలు చెప్పినా కూడా మాస్ రేంజ్ సరిపోవడం లేదు అంటూ వారి ముందే అనేశాడట.పాన్ ఇండియా రేంజ్ లో తనకు వచ్చిన గుర్తింపు వచ్చింది.
కనుక ఆ స్థాయి లోనే సినిమా ఉండాలనే ఉద్దేశ్యంతో యశ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
కన్నడం లో సినిమా లు చేయాలి కాని అవి పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలి అంటూ యశ్ భావిస్తున్నాడట.అందుకే ఇటీవల శంకర్ ఈయన్ను సినిమా కోసం సంప్రదించిన వెంటనే ఓకే చెప్పాడట.శంకర్ దర్శకత్వం లో సినిమా అంటే ఖచ్చితంగా యశ్ కు స్టార్ డమ్ దక్కే అవకాశం ఉందని అంటున్నారు.
యశ్ మరియు శంకర్ ల కాంబోలో మూవీకి ఇంకా రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది.యశ్ కు మరో సౌత్ స్టార్ డైరెక్టర్ కూడా కథ ను చెప్పాడని తెలుస్తోంది.
త్వరలోనే యశ్ పాన్ ఇండియా సినిమా మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి.