యాదాద్రి జిల్లా:భారత కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో ముద్రిస్తామని ఎన్నికల మెనిఫేస్టోలో ప్రకటించిన రాజకీయ పార్టీలకే ప్రజలు పట్టం కట్టాలని సీనియర్ జర్నలిస్టు సొల్లేటి గోవర్ధనాచారి పిలుపునిచ్చారు.మంగళవారం జిల్లా కేంద్రంలో 80వ జ్ఞానమాల దినోత్సవం సందర్భంగా ముందుగా స్థానిక అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి,అనంతరం 80వ జ్ఞానమాలను అంబేద్కర్ విగ్రహానికి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేథావి,బడుగు బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఫోటోను విదేశాల్లో డాలర్లపై ముద్రించి గౌరవిస్తుంటే,మన దేశంలో కరెన్సీపై అంబేద్కర్ ఫోటో ముద్రించకపోవడం అత్యంత బాధాకరమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని,కేంద్ర ప్రభుత్వం బేషరతుగా అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తూ అభినందిస్తున్ళామన్నారు.
ఈ జ్ఞానమాల కార్యక్రమంలో కరెన్సీ నోట్లపై అంబేడ్కర్ ఫోటో సాధన సమితి జిల్లా చైర్మన్ కొడారి వెంకటేష్,జిల్లా అద్యక్షులు బట్టు రామచంద్రయ్య,సాధన సమితి జిల్లా నాయకులు బండారు శివశంకర్,రావుల రాజు,కొత్త నర్సింహ్మ స్వామి,రిటైర్డ్ సిఐ తునికి విజయ్ కుమార్,రేషన్ డీలర్స్ అసోసియేషన్ జిల్లా అద్యక్షులు ఎలుగల రాజయ్య,ఇండియన్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అద్యక్షులు షానూర్ బాబా,మాజీ కౌన్సిలర్ వెల్ధుర్తి రఘునాథ్,నాయకులు షాగంటి ఉమాపతి,బెండ ఆంజనేయులు,వెంకటేష్,మహ్మద్ ఖాజాఫసియొధ్ధీన్, సూదగాని మధు,పోలేపల్లి మైసయ్య,మహేశ్వరం శ్రీనివాస్,సూదగాని దుర్గేష్,కాచం రాజు,పొలిశెట్టి సుధాకర్,భువనగిరి శ్రీనివాస్,నర్సింహ్మ చారి, లక్షణాచారి,శంకర్,సిలివేరు రమేష్,హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.