క్షుద్రపూజలు చేసి.. నరబలి.. అంతేనా పేగులు తీసి, ముక్కలుగా నరికేశారు!

ఝార్ఖండ్ లోని గఢ్ వా జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది.క్షుద్ర పూజలు చేసిన ఓ మహిళ అనంతరం తన సొంత సోదరినే నరబలి ఇచ్చింది.

 Woman Murderred Her Sister For Witchcraft In Jharkhand Details, Jharkhand Crime-TeluguStop.com

నరబలి అంటే ఉత్తిగా చంపడం కాకుండా… ఆమె ప్రైవేటు శరీర భాగాల్లోంచి పేగులు బయటకు తీసి ముక్కలు ముక్కలుగా నరింకింది.అయితే వీరి బంధువులందరూ ఈ ఘటన జరుగుతుండగా అక్కడే ఉన్నారు.

గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయారే తప్ప ఆ బలిని మాత్రం ఆపడం లేదు.అసలు కథ ఏంటో, అదెక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఝార్ఖండ్ లోని గఢ్ వా జిల్లా దలేలి గ్రామంలో లలితా దేవి ఆమె భర్త దినేశ్ ఓరన్ తో కలిసి జీవిస్తోంది.వీరిద్దరూ కలిసి ఓరన్ తోలాలోని రాంశరన్ నివాసానికి క్షద్రపూజలు చేసేందుకు వెళ్లారుయ ఈ క్రమంలోనే అదే గ్రామానికి చెందిన లలితా దేవి సోదరి గుడియాదేవి, ఆమె భర్త మున్నాతో కలిసి వచ్చింది.

అయితే గుడియా రాగానే లలిత క్షద్ర పూజలు చేయడం ప్రారంభించింది.వెంటనే ఆమె భర్త గుడియాను కర్రతో కొట్టగా.ఆమె సపృహ తప్పి పడిపోయింది.అనంతరం లలిత ఆమె భర్త కలిసి ముక్కలు ముక్కలుగా నరికారు.

నాలుకను కూడా కత్తిరించారు.అక్కడితో ఆగకుండా ఆమె ప్రైవేట్ భాగాల్లో చేతులు పెట్టి పేగులు బయటకు తీశారు.

Telugu Daleli, Dinesh Oran, Gudiyadevi, Jharkhand, Kshudrapujalu, Lalitha Devi,

అనంతరం ఆమె మృతదేహాన్ని అడవికి తీసుకెళ్లి దహనం చేశారు.అయితే వీరి బంధువులంతా అక్కడే ఉన్నా ఒక్కరూ ఈ దారుణాన్ని ఆపకపోవడం దారుణం.ఈ ఘటనతో షాక్ కి గురైన గుడియా భర్త.పోలీసుల వద్దకు వెళ్లాడు.మొత్తం ఐదుగురిపై కేసు పెట్టాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దినేశ్ ఓరన్, రాంశరన్ ఓరన్, లలితాదేవి సహా ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

దీనిపై విచారణ వేగవంతం చేసినట్లు స్టేషన్ ఇంఛార్జి యోగేంద్ర కుమార్ చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube