యాదాద్రి జిల్లా:సాయుధ బలగాల శక్తిసామర్ధ్యాలనూ, పూర్వ సంప్రదాయాల మరియు నైతికతను తారుమారు చేస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డీసీసీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా టీపీసీసీ పిలుపు మేరకు సోమవారం భువనగిరి జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద డీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన సత్యాగ్రహ దీక్షలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ,రాష్ట్రంలో కేసీఆర్ నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సైనిక వ్యవస్థను నిర్వీర్యం చేసే ఈ అగ్నిపథ్ పథకం కారణంగా మోడీ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోతుందని జోస్యం చెప్పారు.దేశానికి వెన్నుముక అయిన రైతులను, సైనికులను ఇబ్బంది పెట్టే పార్టీలకు మనుగడ ఉండదని అన్నారు.
అగ్నిపథ్ పథకం రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రేస్ నాయకులు, భువనగిరి పట్టణ నాయకులు,కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.