టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్న బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.గౌతమ్ పల్లి బస్సు వార్తగా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు.
ఇక ఇప్పటికే రికార్డు స్థాయిలో మూడు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లని లైన్ లో పెట్టిన ప్రభాస్ ఇప్పటికే ఓ భారీ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నాడు.ప్రభాస్ నటిస్తున్న తొలి మైథలాజికల్ మూవీ ఆది పురుష్.
రామాయణ గాధ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ తెరకెక్కిస్తున్నారు.దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో జపాన్ మూవీ స్ఫూర్తితో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.
అలాగే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో సలార్,నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తున్నారు.ఈ రెండు చిత్రాలు దాదాపుగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరపైకి వస్తున్నాయి.
ప్రస్తుతం ఈ రెండు భారీ ప్రాజక్ట్ లు షూటింగ్ దశలో వున్నాయి.గత కొన్ని రోజులుగా నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రీకరణ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తుండగా దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది.వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ స్వప్న దత్ నిర్మిస్తున్నారు.
ఇటీవలే కీలక ఘట్టాల చిత్రీకరణ పూర్తి చేశారు.దీపికా పదుకునే కు అస్వస్థతకు గురి కావడం హార్ట్ బీట్ లో తేడా రావడంతో షూటింగ్ కి బ్రేకిచ్చారని ప్రచారం జరిగింది.అయితే తాజాగా దీపిక కోలుకున్న వెంటనే షూటింగ్ లో పాల్గొందని తాజాగా కీలక షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేశారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కీలక షెడ్యూల్ షూటింగ్ పూర్తవడంతో హీరో ప్రభాస్ శనివారం రాత్రి టీమ్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఈ పార్టీలో అమితాబ్ బచ్చన్ తో పాటు చిత్ర బృందం మొత్తం పాల్గొందని ఇదే పార్టీలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా పాల్గొన్నారని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.