యువ హీరో నితిన్ ప్రస్తుతం రాజశేఖర్ రెడ్డి డైరక్షన్ లో మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్నాడు.నితిన్ సొంత బ్యానర్ లో ఈ మూవీ నిర్మిస్తున్నారు.
సినిమాలో నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా ఆగష్టు 12న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు.
ఈ సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయినట్టు తెలుస్తుంది.సినిమాకు అనుకున్న బడ్జెట్ కన్నా 30 శాతం వరకు ఎక్కువ ఖర్చు పెట్టారట.
అందుకే సినిమా రిలీఎజ్ విషయంలో లేట్ అయ్యిందని తెలుస్తుంది.
విలేజ్ పాలిటిక్స్ బ్యాక్ డ్రాప్ తో నితిన్ కెరియర్ లో మాస్ ఎంటర్టైనర్ గా మాచర్ల నియోజకవర్గం సినిమా వస్తుంది.
ఈ సినిమాలో కృతి శెట్టి గ్లామర్ కూడా హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు.దర్శకుడు రాజశేఖర్ రెడ్డి మొదటి సినిమా ఇది కావడంతో బడ్జెట్ విషయంలో కంట్రోల్ తప్పిందని తెలుస్తుంది.
అయితే కంటెంట్ బాగుంది కాబట్టి నితిన్ బడ్జెట్ విషయంలో డైరక్టర్ కి ఫ్రీడం ఇచ్చినట్టు తెలుస్తుంది. మాచర్ల నియోజకవర్గం తర్వాత వక్కంతం వంశీ డైరక్షన్ లో నితిన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది.
ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.