టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలకృష్ణ కు ఎలాంటి క్రేజ్ ఉంటుందో మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన నటుడిగా వెండి తెరపై ఎంతో మంచి గుర్తింపు పొందారు.
ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తు తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు.ఈ క్రమంలోనే బాలకృష్ణ సైతంఅన్ స్టాపబుల్ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించి వ్యాఖ్యాతగా తనేంటో నిరూపించుకున్నారు.
బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఆహా వేదికగా ప్రసారమైన అన్ స్టాపబుల్ ఈ కార్యక్రమం ఎంతో మంచి విజయాన్ని అందుకుంది.ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ సెలబ్రిటీలను ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ వారి నుంచి ఆశక్తికరమైన సమాధానాలు రాబట్టారు.
ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఒక్కసారిగా కార్యక్రమ రేటింగ్స్ పెరగడమే కాకుండా ఆహా సబ్స్క్రైబర్లు కూడా పెరిగి పోయారు.ఈ కార్యక్రమం మంచి గుర్తింపు సంపాదించడంతో నిర్వాహకులు సీజన్ 2 కి భారీ ఏర్పాట్లు చేశారు.
ఇకపోతే ఈ కార్యక్రమానికి కూడా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారని తాజాగా ఈ విషయంపై పరోక్షంగా స్పందించారు.ఇక ఈ కార్యక్రమం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.మొదటి సీజన్ లోఎవరైతే సెలబ్రెటీలు హాజరుకాలేకపోయారో అలాంటివారిని సీజన్2 ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి మొదటి అతిధిగా రాబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే మొదటి సీజన్ సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తో బిజీగా ఉండటం వల్ల రాలేకపోయారు.ఈ క్రమంలోనే సీజన్ 2 లోఎన్టీఆర్ బాలకృష్ణ షోలో పాల్గొనబోతున్నారు అని తెలుస్తోంది.
ఇదే కనుక నిజమైతే నందమూరి అభిమానులకు పండగ అని చెప్పాలి.ఇలా ఒకే వేదికపై బాబాయ్ అబ్బాయ్ ను చూడటం కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.