నేచురల్ బ్యూటీ సాయి పల్లవి, రానా ప్రధాన పాత్రలలో డైరెక్టర్ వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిజ జీవిత ఆధారంగా తెరకెక్కించారు.
ఇక ఈ సినిమాకి అద్భుతమైన ప్రేమకావ్యం జోడించి వేణు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఇకపోతే ఈ సినిమా జూన్ 17వ తేదీ విడుదల అయి మొదటి నుంచి అద్భుతమైన పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటిరోజు పెద్ద ఎత్తున వసూళ్లను రాబట్టి నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందే భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుతున్నట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు నైజాం ఏరియా సీడెడ్ ప్రాంతాలలో కలిపి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకున్నట్లు సమాచారం.దీంతో ఈ సినిమా 14.5 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంగా బాక్స్ ఆఫీస్ బరిలో దిగింది.ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో అన్ని నగరాలలో ప్రదర్శితం అవుతూ మొదటి షో నుంచి అద్భుతమైన టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమా సాయంత్రం ఫస్ట్ వరకు హైదరాబాదులో 32 లక్షలు, వైజాగ్ 3 లక్షలు, వరంగల్ 4, విజయవాడ 2.50 లక్షల రూపాయలు రాబట్టింది.ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా మొదటి రోజు 60 లక్షలు ,చెన్నై కర్ణాటక వంటి ప్రాంతాలతో కలిపి మొత్తం 80 లక్షల వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.
విరాటపర్వం అడ్వాన్స్ బుకింగ్ విషయాన్ని పక్కన పెడితే ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్రలో ఈ సినిమాకి భారీ స్పందన లభించింది.మొదటి రోజు అన్ని ఏరియాలలో 40 నుంచి 50 శాతం వరకు లభించిందని తెలుస్తోంది.దీంతో ఈ సినిమా అంచనాల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో 3.5 కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.171 లోకేషన్లలో 19k డాలర్లను తొలి రోజున రాబట్టింది.ప్రీమియర్లతో కలిపి ఈ చిత్రం 75k డాలర్ల వసూళ్లు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల షేర్, 4 కోట్లకుపైగా గ్రాస్ వసూలు రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు.