యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన విక్రమ్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.భారీ అంచనాల నడుమ రూపొందిన విక్రమ్ సినిమా ను కేవలం తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు.
కన్నడం.మలయాళం మరియు హిందీ లో కూడా భారీ గా విడుదల చేస్తున్నారు.
తెలుగు లో ఈ సినిమా ను నితిన్ యొక్క తండ్రి సుధాకర్ రెడ్డి భారీ గా ఖర్చు చేసి విడుదల చేయబోతున్నాడు.రికార్డు స్థాయి రేటుకు ఆయన కొనుగోలు చేయడం జరిగింది.
ఒక డబ్బింగ్ సినిమా అన్నట్లుగా కాకుండా ఒక డైరెక్ట్ సినిమా అన్నట్లుగానే ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.పెద్ద ఎత్తున కమల్ హాసన్ సినిమా ను తెలుగు లో ప్రమోట్ చేయడం ఇదే ప్రథమం అంటున్నారు.
శిల్ప కళా వేదికలో మే 31వ తారీకున భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించబోతున్నారు.సినిమా కు సంబంధించిన ప్రమోషన్ వేడుకలు ఈమద్య కాలంలో భారీగా నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా నే ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుక ఆహా ఓహో అన్నట్లుగా నిర్వహించడంతో పాటు ఒక టాలీవుడ్ బడా సెలబ్రెటీని కూడా రప్పిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.మొత్తానికి విక్రమ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఎప్పుడు లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో కుమ్మేస్తున్నారు.
ఇలాంటి ప్రమోషనల్ ఈవెంట్స్ డబ్బింగ్ సినిమా లకు ఇదే ప్రథమం అంటూ కామెంట్స్ వస్తున్నాయి.సోషల్ మీడియాలో మరియు వెబ్ మీడియాలో ఈ సినిమా యొక్క సందడి అంతా ఇంతా కాదు.ప్రతి చోట కూడా విక్రమ్ తాలూకు హడావుడి కనిపిస్తుంది.కనుక విక్రమ్ కు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ ఖాయం అంటూ నెటిజన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.