బండి సంజయ్ గారు తెలంగాణలో శాంతియుతంగా ఉన్న అన్ని మతస్థులను, తన వ్యాఖ్యల ద్వారా రెచ్చగొట్టి తెలంగాణలో శాంతి లేకుండా చేయాలనుకుంటున్నారని, తద్వారా తన రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకుంటున్నాడని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కె ఏ పాల్ విమర్శించారు.వెంటనే బిజెపి కేంద్ర నాయకత్వం బండి సంజయ్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ కుటుంబంలో ఒకరైన, బాలకృష్ణ కు గానీ జూనియర్ ఎన్టీఆర్ కి గాని ఆ పార్టీ పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేశారు.ఆర్ కృష్ణయ్య బీసీ అందరికీ ఏమైనా ప్రతినిధి నా? ఒక ఆర్.కృష్ణయ్య కు జగన్ రాజ్యసభ సీటు ఇచ్చినంత మాత్రాన బీసీ లందరూ కళ్లుమూసుకుని గుడ్డి వాళ్ళ లాగా ఓటేస్తారా అని ప్రశ్నించారు.ఓట్ల కోసం కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు.