సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

ఖమ్మం జిల్లా రూరల్ మండలం ముత్తగూడెంలో సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు.నేను బిక్షాలేసే మనిషిని కాదు మీరే పది మందికి భిక్ష మిచ్చే స్థాయికి తీసుకొస్తానని మీరు గెలిపించినందుకు పాలేరుకు పెద్ద పాలేరుగా పనిచేశానని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు.

 Former Minister Tummala Nageswara Rao Participated In The Unveiling Of The Sarda-TeluguStop.com

సర్వాయి పాపన్న విగ్రహా ఆవిష్కరిణ అనంతరం ఆయన మాట్లాడుతూ పాలేరు ప్రజలకు సకల సౌకర్యాలు ఉండాలని వారి కష్టాలు తీరాలనే ఎవరూ వద్దన్నా పాలేరుకు వచ్చి పెద్ద పాలేరుగా పనిచేశానన్నారు.

డెబ్భై సంవత్సరాలుగా చూడని అభివృద్ధిని మూడు సంవత్సరాలలో చేసి చూపించానన్నారు.

తన హయాంలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశానన్నారు.కొంత పార్టీలోనే ఉండి ద్రోహం చేశారని ఆయన అన్నారు.

పార్టీలకు అతీతంగా ప్రజల కష్టాలు తీర్చానన్నారు ఆయన.గతంలో పాలేరులో పోటీ చేసేందుకు అనేక రాజకీయ పార్టీలు అడ్డంకులు సృష్టించాయని ఆయన అన్నారు.పాలేరు తో పాటు జిల్లా ప్రజలకు కూడా తుమ్మల నాగేశ్వరరావు ఏంటో అర్ధం కావాలన్నారు.పాలేరు ప్రజలు ఐక్యంగా ఉండి భవిష్యత్ లో మంచిని, ధర్మాన్ని, నీతిని గెలిపించేందుకు కృషి చేయాలన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube