సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్న వసూళ్ల పరంగా దూసుకు పోతుంది.
మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.ఇక మహేష్ బాబు ఈ సినిమా తర్వాత తాను చేయబోయే సినిమాపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తుంది.
ఒక వైపు దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా గురించి చర్చిస్తూనే మరో వైపు ఇప్పటికే లాంచ్ చేసిన త్రివిక్రమ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లేందుకు మహేష్ సన్నాహాలు చేస్తున్నాడు.ఈ సినిమా రెగ్యురల్ షూటింగ్ జులై నుండి స్టార్ట్ కాబోతుందట.
ప్రెసెంట్ మహేష్ బాబు అమెరికా టూర్ లో ఉన్నారు.ఆయన వచ్చిన తర్వాత ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సినిమాలో మరో హీరో కూడా కనిపించే అవకాశం ఉంది అని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది.
ఇటీవలే వచ్చిన టాక్ ప్రకారం ఈ సినిమాలో మహేష్ తో పాటు న్యాచురల్ స్టార్ నాని స్క్రీన్ షేర్ చేసుకో బోతున్నాడు అని వార్తలు వచ్చాయి.అయితే ఇప్పుడు మరొక హీరో పేరు వినిపిస్తుంది.
ఈ సినిమాలో నందమూరి హీరో కూడా నటించ బోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.ఈ సినిమా కీ రోల్ లో నందమూరి తారక్ రత్న కూడా నటించ బోతున్నాడట.
తారక్ రత్న ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అట.మరి ఈ వార్తలో కూడా నిజం ఎంత ఉందొ తెలియదు.కానీ ఇప్పుడు ఈ వార్త నెట్టింట వైరల్ అయ్యింది.
ఇక ఈ సినిమా షూట్ ను ముందుగా మహేష్ సోలో సాంగ్ తో మొదలు పెట్టనున్నారట.ఆ తర్వాత లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేసారని తెలుస్తుంది.ఇందులో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.
థమన్ సంగీతం అందిస్తున్నారు.హారిక హాసిని బ్యానర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.