1.త్వరలో ఐదు ఎన్ఆర్ఐ కోర్టుల ఏర్పాటు
త్వరలోనే ఐదు ఎన్ఆర్ఐ కోర్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది.
2.అమెరికా యూనివర్సిటీ లో ఆనంద్ మహేంద్ర కు అరుదైన గౌరవం
పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహేంద్ర కు అమెరికాలో తాజాగా ఓ అరుదైన గౌరవం దక్కింది.టాఫ్ట్స్ యూనివర్సిటీలోని ఫ్లెచర్ స్కూల్ ఆఫ్ లా అండ్ డిప్లమా సి లో జరిగిన క్లాస్ డే వేడుకలలో ప్రసంగించిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డు సృష్టించారు.
3.భారత ప్రవాసులకు గాయాలు
రాజధాని అబుదాబీ లోని ఓ రెస్టారెంట్ లో సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో 106 మంది ప్రవాసులు గాయపడినట్లు, ఇద్దరు ప్రవాసులు మృతిచెందినట్లు భారత ఎంబసీ ప్రతినిధి వెల్లడించారు.
4.అమెరికాలో కాల్పులు .21 మంది మృతి
అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి.టెక్సాస్ లోని ఓ ఎలిమెంటరీ పాఠశాలలు దుండగులు కాల్పులకు పాల్పడడంతో 19 మంది చిన్నారులతో సహా 21 మంది మృతి చెందారు.
5.భారత ప్రవాసులు, నివాసితులకు కొత్త కండిషన్స్
కువైట్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు ఒసామా అల్ మనావర్ తాజాగా ఓ ప్రతిపాదన తీసుకువచ్చారు .నివాసితులు ప్రవాసులు ఇకపై కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళ్లాలంటే వారికి ఉన్న అన్ని జరిమానాలు క్లియర్ చేయాలనే ప్రతిపాదనను పార్లమెంట్ లో పెట్టారు.
6.భారత సంతతి విద్యార్థిపై అమెరికా లో దాడి
భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి పై కాకు చెందిన ఓ విద్యార్థి దాడికి పాల్పడడం కలకలం రేపింది.
కాపెల్ మిడిల్ స్కూల్ లో మే 15 న ఈ ఘటన జరిగింది.దీనిపై అమెరికాలోని భారత సంతతి చట్టసభ సభ్యులు తాజాగా ఆందోళన చేపట్టారు.
7.భారతీయ అమెరికన్ల పై కమల హ్యారీస్ ప్రశంసలు
అమెరికా రాజకీయాల్లో దుర్గ పాల్గొంటున్న భారతీయ అమెరికన్ల పై అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హారిస్ ప్రశంసలు కురిపించారు.
8.మక్కాలో హైదరాబాద్ ఎన్నారై మృతి
అరేబియాలోని మక్కా లో విషాద ఘటన చోటు చేసుకుంది.హైదరాబాద్ కు చెందిన ఎన్ఆర్ఐ మొహిద్దిన్ అజీజ్ ప్రమాదవశాత్తు ఓ భవనంపై నుంచి పడి మృతి చెందారు.
9.దావోస్ లో జగన్ వరుస భేటీలు
దావోస్ లో జగన్ పెట్టుబడులే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు.ఏపీ పెవిలియన్ లో ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ అయ్యారు.
10.శ్రీలంక ప్రధాని కి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు
తీవ్ర ఆర్థిక ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకలో పరిస్థితిని మార్చేందుకు ప్రధాని రాణిల్ విక్రమ సింగే ను ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఆర్థిక మంత్రిగా బుధవారం నియమించారు.