ధర్మస్థలి.మెగా స్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య.
ఈ సినిమా మెగా ఫ్యాన్స్ ను బాగా నిరాశ పరిచింది.మెగాస్టార్, చరణ్ ను ఒకే తెరమీద చూసాము అనే ఆనందం కూడా లేకుండా చేసింది.
అలాగే ఎప్పుడు అపజయం చూడని కొరటాల కూడా ఈ సినిమాతో అట్టర్ ప్లాప్ ఎదుర్కొన్నాడు.
ఈ సినిమాలోని ధర్మస్థలి, పాదఘట్టం గురించి సోషల్ మీడియాలో భారీ ట్రోల్స్ జరిగాయి.
అయితే ఇప్పుడు అదే సెట్స్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఉపయోగించు కోబోతున్నాడట.ధర్మస్థలి లో సల్మాన్ నటిస్తున్న కబీ ఈద్ కబీ దివాలీ అనే సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారట.
ఈ సినిమా కోసం ధర్మస్థలి వంటి సెట్టింగ్ సల్మాన్ ఖాన్ కు కావాల్సి వచ్చిందట.
అందుకే ధర్మస్థలి సెట్ లో కొన్ని మార్పులు చేసి తమకు అనుకూలంగా సెట్ ను మార్చుకుంటున్నారట.
అందుకోసం ఒక టీమ్ ఇప్పటికే పని చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఆచార్య సినిమా ప్లాప్ అయినా భారీ ఖర్చుతో కొరటాల వేయించిన ఈ సెట్ కు మంచి మార్కులు పడ్డాయి.ధర్మస్థలి సెట్టింగ్ ను కొద్దిగా మార్చితే సరిపోతుంది అని అనుకుని ఇలా మార్పులు చేపట్టినట్టు తెలుస్తుంది.ఇక సల్మాన్ ఖాన్ కు మెగా కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉంది.
కాబట్టి ఈ చొరవతోనే సల్మాన్ ఖాన్ ఈ సెట్టింగ్ ను వాడుకుంటున్నట్టు తెలుస్తుంది.
ఇక సల్మాన్ నటిస్తున్న కబీ ఈద్ కబీ దివాలీ అనే సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఆమెకు అన్న పాత్రలో వెంకటేష్ నటిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.దీంతో తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తి నెలకొంది.
మరి ఎన్ని మార్పులు చేసి ఈ సెట్ ను మరింత అందంగా తీర్చి దిద్దుతారో తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.