ఒకప్పుడు మెగా అభిమనులు, బన్నీ అభిమానులు వేర్వేరుగా ఉండేవారు కాదు.అయితే కొన్నేళ్ల క్రితం బన్నీ చెప్పను బ్రదర్ అంటూ చేసిన కామెంట్ల వల్ల మెగా ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ వేరయ్యారు.
తాజాగా విజయవాడలో మెగా అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఫ్యాన్స్ మీట్ వల్ల జరిగిన మంచి కంటే నష్టమే ఎక్కువని కామెంట్లు వినిపిస్తున్నాయి.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, చరణ్ అభిమానులు మాత్రమే మెగా అభిమానులు అనేలా ఈ మీటింగ్ జరిగింది.
ఈ మీటింగ్ లో బన్నీకి వ్యతిరేకంగా కామెంట్లు చేయడంతో పాటు మెగా ఫ్యాన్స్ బన్నీ పల్లకి మోయాల్సిన అవసరం లేదని కామెంట్లు వినిపించాయి.అయితే ఈ విషయం తమ దృష్టికి రావడంతో బన్నీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ‘ఏం పీకలేరు బ్రదర్’ అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండింగ్ చేస్తుండటం గమనార్హం.1,22,000 ట్వీట్లతో ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతుండగా ఇతర హీరోల అభిమానుల నుంచి కూడా బన్నీ ఫ్యాన్స్ కు సపోర్ట్ లభిస్తోంది.
బన్నీ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి చనిపోయారనే విధంగా బన్నీ ఫ్యాన్స్ ప్రచారం చేస్తుండటం గమనార్హం.మెగా ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా జరిగిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ ను కూడా కలుపుకుంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఫ్యాన్స్ మధ్య చీలిక రావడం వల్ల జనసేన పార్టీకి కూడా నష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం బన్నీ వరుస ఇండస్ట్రీ హిట్లతో కెరీర్ ను కొనసాగిస్తున్నారు.నార్త్ లో కూడా బన్నీకి భారీ స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే.మెగా ఫ్యాన్స్ మధ్య గ్యాప్ వల్లే ఆచార్య సినిమాకు నష్టం జరిగిందని కామెంట్లు వినిపించాయి.మెగా హీరోలు జోక్యం చేసుకుని అభిమానుల మధ్య చీలికలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది.