1.సింగపూర్ లో ఘనంగా అన్నమయ్య శతగళర్చన
తెలుగు భాగవత ప్రచార సమితి ఆధ్వర్యంలో ఐదవ అన్నమయ్య శతక రచన మొదటి రోజు కార్యక్రమం సింగపూర్ లోని సివిల్ సర్వీసెస్ క్లబ్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది.
2.ఎన్ఆర్ఐ యువతకు ఎమ్మెల్యే టికెట్లు
పార్టీ కోసం పని చేసే ఎన్.ఆర్.ఐ యువతకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.
3.తానా – బాట వసంతోత్సవం 2022
తానా – పాట సంయుక్తంగా నిర్వహిస్తున్న పాఠశాల వసంతోత్సవం కి రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసు ఉన్నతాధికారిగా పని చేసిన అకూన సబర్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.” అమెరికాలో కూడా మాతృభాషను మర్చిపోకుండా ఎంతో ఇష్టపడి కష్టపడి నేర్చుకున్న మీకు నేను డిగ్రీ సర్టిఫికెట్స్ అందజేసే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషిస్తున్నాను ” అని అకున్ సబర్వాల్ వ్యాఖ్యానించారు.
4.లండన్ మేయర్ గా ఎన్నికైన భారత వ్యాపార వేత్త
లండన్ బరో ఆఫ్ సౌత్ వార్క్ కు తాజాగా జరిగిన ఎన్నికల్లో ఇండియాకు చెందిన వ్యాపారవేత్త సునీల్ చోప్రా ఎన్నికయ్యారు.
5.భారత్ తో సహా 16 దేశాల వెళ్లకుండా సౌదీ నిషేధం
సౌదీ అరేబియా దేశం లో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో భారత్ తో సహా 16 దేశాలకు తమ దేశం పౌరులు వెళ్లకుండా అక్కడి ప్రభుత్వం నిషేధం విధించింది.
6.తెలుగు ప్రవాసుల కు కేటీఆర్ పిలుపు
తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుని పురిటిగడ్డ రుణం తీర్చుకోవాలని రాష్ట్ర ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
7.అమెరికాకు చైనా వార్నింగ్
చైనా దాడి చేస్తే తైవాన్ కు తాము రక్షగా ఉంటానని అమెరికా అధ్యక్షుడు జో బైడన్ చేసిన వ్యాఖ్యలపై చైనా స్పందించింది.చైనాను ఎవరూ తక్కువగా అంచనా వేయవద్దు అంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి అమెరికా కు కౌంటర్ ఇచ్చారు.
8.దావోస్ లో జగన్ సమావేశాలు
స్విట్జర్లాండ్ లోని దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు లో ఏపీ సీఎం జగన్ పలువురు ప్రముఖులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.
9.ఆస్ట్రేలియా ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన భారత సంతతికి చెందిన మహిళ
ఆస్ట్రేలియన్ ఫెడరల్, సెనేట్ ఎన్నికల్లో ఎంపీగా తొలి భారత సంతతికి చెందిన జానేటా మస్క రెన్హాస్ ఎన్నికయ్యారు.
10.భారత ప్రధానిని హిందీలో పలకరించిన జపాన్ విద్యార్థులు
ప్రస్తుతం జపాన్ లోని టోక్యో లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ కి అక్కడ ఘనస్వాగతం లభించింది అంతేకాకుండా జపాన్ కు చెందిన విద్యార్థులు మోదీ ని హిందీ లో పలకరించి ఆశ్చర్యానికి గురి చేశారు.