ఇటీవల కాలంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్లు సినిమాల్లో హీరోయిన్ పాత్రలో నటించడమే కాదు కుదిరితే స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తూ తమ అందాల ఆరబోతతో అందరికీ పిచ్చేస్తున్నారు.ఇప్పటి వరకు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల హవా నడిపించిన అందరూ కూడా ఇలా ఐటెం సాంగ్స్ చేశారు అన్న విషయం తెలిసిందే.
అయితే ఐటమ్ సాంగ్స్ చేయడానికి అందరూ కొన్ని లెక్కలు వేసుకుంటున్నారు అని తెలుస్తోంది.సినిమాకు తీసుకున్న దాంట్లో సగం రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఐటమ్స్ తో తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు అని చేస్తున్నారు.
పెళ్లై పిల్లలు ఉన్న యాంకర్ అనసూయ గతంలో ఒక ఐటమ్ సాంగ్ చేసింది రెమ్యూనరేషన్ కూడా బాగానే తీసుకున్నట్లు టాక్.జాతి రత్నాలు హీరోయిన్ ఫారియా అబ్దుల్లా సైతం బంగార్రాజులో ఐటమ్ సాంగ్ చేసింది.
అయితే ఈ సాంగ్ కోసం పారితోషికం కూడా బాగానే తీసుకుందట.ఈ క్రమంలోనే దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని అనుకుంటున్నారు హీరోయిన్స్.
ఇప్పటివరకు పాయల్ రాజ్ పుత్, అంజలి, ప్రియమణి లు ఐటమ్ సాంగ్ లో కనిపించారు.ఇప్పుడు బాలీవుడ్ నుంచి కూడా టాలీవుడ్ లో గ్లామర్ హీరోయిన్స్ గా ఐటమ్ సాంగ్స్ చేయడానికి వచ్చేస్తున్నారు.
వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న పూజా హెగ్డే ఎఫ్ 3 సినిమా లో స్పెషల్ సాంగ్ లో చేసి మతి పోగొట్టింది.
గతంలో కూడా చరణ్ కోసం రంగస్థలంలో జిగేల్ రాణి గా అదరగొట్టింది.ఈ పాటలకు రెమ్యూనరేషన్ విషయంలో కూడా తగ్గేదేలే అంటుందట.ఇక సమంత ఐటమ్ సాంగ్ అంటే అంతా షాక్ అయ్యారు.
కానీ ఆ తర్వాత రెమ్యునరేషన్ గురించి తెలుసుకుని.ఇంత ఇచ్చిన తర్వాత ఎందుకు చేయరూ అని ఫిక్స్ అయ్యారు.
ఇప్పటికి కూడా సమంత చేసిన ఐటమ్ సాంగ్ అందరి నోళ్లలో నానుతూనే ఉంది.అల్లుడు శీను సినిమాలో తమన్నా ఐటం సాంగ్ చేసిన అదరగొడుతోంది.
ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ మొదలుపెట్టిన మాత్రం శ్రియ అని చెప్పాలి.