మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాలోయింగ్ నే వేరు.సౌత్ హీరోల్లో మహేష్ కు ఉన్న ఫాలోయింగ్ మరెవ్వరికీ లేదు అంటే నమ్మాల్సిందే.
ఇక ఈయన నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకున్న వసూళ్ల పరంగా దూసుకు పోతుంది.
ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యిందంటూ నిర్మాతలు ప్రకటించడంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు.
మహేష్ ఖాతాలో మరొక బ్లాక్ బస్టర్ సినిమా పడింది.
ఈ వారం కూడా పెద్దగా సినిమాలు ఏవీ లేకపోవడంతో సర్కారు ఈ వారం కూడా బాక్సాఫీస్ ను దున్నేయడానికి రెడీ అయ్యాడు.ఈ క్రమంలోనే మరిన్ని ప్రొమోషన్స్ చేసి ఈ సినిమాపై ఆసక్తి పెంచేసాడు.
తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మహేష్ మల్టీ స్టారర్ సినిమాల గురించి మాట్లాడారు.
ఈయన ఇప్పటికే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ తో మల్టీ స్టారర్ చేసాడు.
ఈ సినిమా ఘన విజయం సాధించింది.అయితే ఈ సినిమా తర్వాత మహేష్ మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాలో నటించలేదు.కానీ మల్టీ స్టారర్ సినిమాపై తాజాగా ఈయన పాజిటివ్ గా స్పందించడంతో మరొక మల్టీ స్టారర్ ఈయన నుండి రాబోతుంది అని ఫ్యాన్స్ అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈయన మాట్లాడుతూ.మంచి కథలతో వస్తే తప్పకుండ మల్టీ స్టారర్ సినిమాలో నటించేందుకు సిద్ధం అన్నట్టుగా మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.దీంతో ఇండస్ట్రీ వర్గాలు సైతం ఈయన ఫ్యూచర్ లో మల్టీ స్టారర్ సినిమాలు తప్పకుండ చేస్తాడు అని అనుకుంటున్నారు.
ఇక ఈయన సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడు.ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తో సినిమా చేయనున్నాడు.