‘మందుబాబులం మేము మందుబాబులం‘ అని అక్కడ అంతా చిందేస్తున్నారు.కట్ చేస్తే అక్కడికి పోలీసులు రావడం, పెద్దమొత్తంలో మద్యం కేసెస్ లను స్వాధీనం చేసుకొని మందుబాబులు చెల్లాచెదరగొట్టి లైసెన్స్ లేని ముఠాలను తీసుకెళ్లి జైల్లో వేశారు.
ఇది ఎక్కడో విన్నట్టు వుంది కదూ.చూసే వుంటారు కూడా.ఎందుకంటే మన చుట్టూ ఇలాంటి సంఘటనలు ప్రతి రోజు జరుగుతూనే ఉంటాయి.అలా దొరికిన బాటిల్స్ ని పోలీసుకు కొంపదీసి తాగుతారా? అనే అనుమానం ఎంతో మందికి వస్తుంది.కానీ వాళ్ళు అలాంటి మద్యాన్ని అసలు ముట్టనే ముట్టారట.మరి ఏం చేస్తారు.
అదిగో అక్కడికే వస్తున్నా.అలా దొంగతనంలో పట్టుబడిన మందు బాటిళ్లను పోలీసులు స్టేషన్ పరిధిలోనే భద్ర పరుస్తారు.అలా దాచిన మందుబాటిళ్లను మూడు, నాలుగేళ్ళకొకసారి కనికరం లేకుండా చిదిమేస్తూ వుంటారు మన పోలీసు బలగాలు.ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా వివిధ కేసులలో పట్టుబడిన దాదాపు 22 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని అనంతపురం 4 వ పట్టణ పోలీసులు ధ్వంసం చేశారు.72 కేసుల మద్యం సీసాలను రోడ్డురోలర్ సహాయంతో తొక్కించేశారు.అవును… గత మూడేళ్లుగా వివిధ కేసులలో పట్టుబడిన అక్రమ మద్యం సీసాలను అనంతపురం 4వ పట్టణ పోలీసులు తాజాగా రోడ్డుపై వేసి రోలర్ తో తొక్కించేశారు.జిల్లా SP ఫక్కీరప్ప ఆదేశాల మేరకు DSP వీర రాఘవరెడ్డి, సెబ్ అధికారి వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో CI జాకీర్ హుస్సేన్ ఆధ్వర్యంలో భద్రపరిచిన మద్యం బాటిళ్లను బయటకు తీసి లెక్కించారు.మద్యం సీసాలను నగర శివారులోని టీవీ టవర్ సమీపంలో రోడ్డు రోలర్ కింద తొక్కించారు.
మూడేళ్ల కాలంలో పట్టుబడిన 72 కేసుల మద్యం సీసాలను రోడ్డురోలర్తో తొక్కించేశారు.దాదాపు 22 లక్షల రూపాయల విలువైన మద్యాన్ని ధ్వంసం చేశారు.