మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.మెగస్టార్ చిరంజీవి అల్లుడిగా మాత్రమే కాకుండ నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయమైన సాయి ధరమ్ ఆ సినిమా మంచి సక్సెస్ అయ్యింది.దాని తర్వాత ఎవడే సుబ్రమణ్యం, సుప్రీమ్, విన్నర్ వంటి సినిమాల ద్వారా తన ఇమేజ్ పెంచుకున్నాడు.
ఇదిలా ఉండగా ఇటీవల సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్స్ బారిన పడి విషమ పరిస్థితుల నుండి కోలుకున్నాడు.యాక్సిడెంట్ తర్వాత ఇంటికే పరిమితమైన సాయి ధరమ్ తేజ్ ఈ మధ్య అక్కడక్కడ కనిపిస్తున్నాడు.
ఇటీవల సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన పొలిటికల్ డ్రామా ” రిపబ్లిక్” .ఈ సినిమాకు దేవకట్టా దర్శకత్వం వహించారు.గతేడాది అక్టోబర్ లో విడుదలైన ఈ సినిమా థియేటర్ల వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది.సాయి ధరమ్ తేజ్ నటించిన మొట్టమొదటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ సినిమా ఇది.ఈ సినిమా క్రిటిక్స్ నుండి కూడా పాజిటివ్ కామెంట్స్ అందుకుంది.
ఈ రిపబ్లిక్ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించగా.జగపతిబాబు, రమ్యకృష్ణ, ఆమని, సుబ్బరాజు, రాహుల్ రామకృష్ణ వంటి ప్రముఖులు కూడా నటించారు.ఇదిలా ఉండగా ఇటీవల ఈ సినిమా డైరెక్టర్ దేవకట్టా సోషల్ మీడియా ద్వారా రిపబ్లిక్ పార్ట్ 2 గురించి వివరణ ఇచ్చాడు.
ఈ క్రమంలో ఆయన “రైటింగ్, ఫామిలీ టైం! ఇప్పటిదాకా సినిమా కథ, ఐడియాతో ఏ హీరోకు కానీ నిర్మాతకు కానీ చెప్పలేదు.కేవలం కొన్ని కొత్త ఐడియాస్ మరియు జోనర్స్ ను ఆలోచిస్తున్నాను.
ఒకటి లేదా రెండు విభిన్న జోనర్ లలో సినిమాలు ట్రై చేసిన తర్వాత ‘రిపబ్లిక్ 2’ సినిమా ఉంటుంది” అని ట్వీట్ చేశారు.