మెగా డాటర్ నిహారిక ఈ మధ్య కాలంలో వివాదాలకు దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నిస్తున్నా వివాదాల ద్వారా ఆమె వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.కొన్ని సందర్భాల్లో ఏ తప్పు చేయకపోయినా కొంతమంది కావాలని నిహారికను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారు.
కొంతమంది నెటిజన్లు సమంతతో పోల్చి ఆమెను ట్రోల్ చేస్తుండటం గమనార్హం. ఒక ఇష్యూ వల్ల నిహారిక కొన్నిరోజుల క్రితం పోలీస్ స్టేషన్ కు వెళ్లారనే సంగతి తెలిసిందే.
నాగబాబు గారాలపట్టి అయిన నిహారిక వెబ్ సిరీస్ ల ద్వారా, సినిమాల ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నారు.పలు బుల్లితెర షోలకు నిహారిక హోస్ట్ గా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు.
2020 సంవత్సరంలో చైతన్యతో నిహారిక వివాహం జరగగా నిహారిక పెళ్లి విశేషాలకు సంబంధించి ఎన్నో వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత అపార్టుమెంట్ వాసులకు, నిహారిక ఫ్యామిలీ మెంబర్స్ కు మధ్య వివాదం చెలరేగింది.
ఆ తర్వాత నిహారిక ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేయగా ఆ వీడియో గురించి నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వినిపించాయి.ఆ తర్వాత నిహారిక పబ్ కు వెళ్లడంపై సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో వేర్వేరు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా నిహారిక లిప్ లాక్ ఫోటోను షేర్ చేయగా కొంతమంది పాజిటివ్ గా కామెంట్లు చేస్తే ఎక్కువమంది నెగిటివ్ గా కామెంట్లు చేయడం గమనార్హం.
తాజాగా నిహారిక జోర్దార్ దేశంలో దిగిన ఫోటోలు షేర్ చేయగా నెటిజన్లు సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు.నిహారిక ఇక్కడ దొరకని వాటి కోసం అక్కడికి వెళ్లిందని సమంత దారిలో ఆమె నడుస్తోందని కామెంట్లు చేస్తున్నారు.అయితే నిహారిక మాత్రం ట్రోల్స్ ను పెద్దగా పట్టించుకోకుండా కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు.